కావాల్సినవి :
గుమ్మడికాయ- 1/4 కేజీ ముక్క ,చిలకడదుంప- 1 పెద్దది ,ఉల్లిపాయ- 1 పెద్దది, పచ్చిమిరపకాయ -2/3, చింతపండు - నిమ్మకాయంత (నీళ్లలో నానపెట్టాలి), బెల్లం -1/2 స్పూన్, కొత్తిమీర- 2 రెమ్మలు, నూనె- 3 స్పూన్స్ ,పసుపు - చిటికెడు , ఉప్పు- తగినంత
తాలింపు సామాను:ఆవాలు - 1/4 స్పూన్ , జీలకర్ర -1/4 స్పూన్, పచ్చిపప్పు- 1 స్పూన్, మినపప్పు-1 స్పూన్, ఎండు మిరపకాయలు -2/3, కరివేపాకు -1 రెమ్మ, వెల్లుల్లి - 4 పాయలు, ఇంగువ - చిటికెడు
ముందుగా కడాయిలో నూనె పోయాలి, నూనె వేడెక్కాక తాలింపు సామాను, కచ్చా పచ్చగా దంచిన వెల్లులి వేయాలి. తాలింపు సామాను చిటపటలాడాక ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.
చిలకడదుంప వేసి 5 నిమిషాలు వేయించుకున్నాక, గుమ్మడికాయ ముక్కలు వేసి ఒక కప్పు నీళ్లు, పసుపు మరియు ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు నీరు దగ్గరికి వచ్చేదాక ఉడికించుకోవాలి.
గమనిక :
1. చింతపండు నుండి గుజ్జు బాగా రావాలి అంటే రెండు లేదా మూడు సార్లు నీళ్లు పోసి బాగా పిసికి నీరుని వడకట్టాలి.
2. పులుసులు అప్పటికి అప్పుడు తినే కన్నా, సాయంత్ర లేదా మర్నాడు తింటే బాగా రుచిగా ఉంటుంది.
సెర్వింగ్: నలుగురికి సరిపోతుంది
No comments:
Post a Comment